- Advertisement -
వరల్డ్కప్లో ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ఆరంభమైంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చివరిగా ఆడిన మ్యాచ్లో అఫ్గాన్పై తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 397 పరుగుల భారీ స్కోరు చేసిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇదే జోష్తో అంతంత మాత్రంగానే రాణిస్తున్న లంకపై గెలుపొంది సెమీస్కు ముందడుగు వేయాలని మోర్గాన్సేన భావిస్తోంది. టోర్నీలో ఐదు మ్యాచ్లాడిన లంక ఒకదాంట్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.