Sunday, April 28, 2024
- Advertisement -

ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్..190 పరుగుల లీడ్‌లో టీమిండియా

- Advertisement -

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 436 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ జడేజా సెంచరీని మిస్ చేసుకున్నాడు. జ‌డేజా 180 బంతుల్లో 2 సిక్స్‌లు,7 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశారు. జడేజా ఔట్ అయిన నెక్ట్స్‌ బంతికే బుమ్రా డకౌట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది. రూట్ 4,అహ్మద్,హార్ట్‌లీ తలో రెండో వికెట్లు పడగొట్టారు.

టీమిండియా ఆటగాళ్లలో జైస్వాల్ 80, రాహుల్ 86,రోహిత్ 24,గిల్ 23,శ్రేయాస్ 35,,శ్రీకర్ భరత్ 41,అక్షర్ పటేల్ 44 పరుగులు చేశారు. టీమిండియా ఓవ‌ర్‌నైట్ స్కోర్‌కు మ‌రో 35 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన వికెట్లను కొల్పోయింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 246కే క‌ట్ట‌డి చేశారు భార‌త బౌలర్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -