కశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు పడుతున్నాయి. నిన్న గౌతమ్ గంభీర్ అదిరిపోయో పంచ్ ఇవ్వగా ఇవాలా టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటర్ ఇచ్చారు. తన జాతి ప్రయోజనాలను వ్యతిరేకించే ఎవరి అభిప్రాయాలకూ తన మద్దతు ఉండదని కోహ్లి స్పష్టంచేశాడు.
ఓ భారతీయుడిగా దేశానికి ఏది మంచిదో అదే చేస్తాం. కొన్ని అంశాలపై స్పందించాలా వద్దా అన్నది వాళ్ల వ్యక్తిగత విషయం. ఓ అంశంపై పూర్తి అవగాహన లేకుండా నేను మాట్లాడను. కానీ నా వరకు దేశ ప్రయోజనాలే ముందుంటాయి అని కోహ్లి తేల్చి చెప్పాడు
కశ్మీర్లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అమాయకులను అణచివేస్తున్నారంటూ పాక్ క్రికెటర్ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో యూఎన్ (ఐక్యరాజ్యసమితి) జోక్యం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
As an Indian you want to express what is best for your nation & my interests are always for the benefit of our nation. If anything opposes it, I would never support it for sure: Virat Kohli on #ShahidAfridi (1/2) pic.twitter.com/EWUKQwlXec
— ANI (@ANI) April 4, 2018