- Advertisement -
మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్లో సంచనాలకు మారుపేరు.నేటి(జూలై7)తో 37 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాడు ధోని. ధోని పుట్టిన రోజు సందర్భంగా టీం సభ్యులు అతని బర్త్ డే వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.
భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్గా ధోని నిలిచాడు. ఈ పుట్టిన రోజు వేడుకలలో అతని భార్య సాక్షి,అతని కూతురు కూడా పాల్గొన్నారు.