Wednesday, May 15, 2024
- Advertisement -

భార‌త్ …పాక్ మ్యాచ్‌ను తిల‌కించిన విజ‌య్ మాల్యా

- Advertisement -
Vijay Mallya enjoying at India-Pakistan Champions Trophy in Birmingham

భార‌త్ …పాక్ మ‌ద్య జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోపీ మ్యాచ్‌లో ఓ వ్య‌క్తి ద‌ర్శ‌న మిచ్చారు.అయ‌న ఎవ‌రో కాదు లిక్క‌ర్ కింగ్ విజ‌య్‌మాల్యా.అధికారులు చ‌ర్య‌లు తీసుకునేస‌రికి దేశం విడిచి వెళ్లిపోయిన లిక్క‌ర్ కింగ్ గా చెప్పుకునే విజ‌య్ మాల్యాను దేశానికి తెప్పించ‌టానికి మోడీ స‌ర్కారు కిందామీదా ప‌డుతోంది.ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినాఆయ‌న్ను దేశానికి తిరిగి తీసుకురావ‌టం మాత్రం సాధ్యం కావ‌టం లేదు.

బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ్గొట్టి లండ‌న్‌లో ల‌గ్జ‌రీ జీవితం గ‌డుపుతున్న లిక్క‌ర్ కింగ్‌…అనూహ్యంగా ఆదివారం లండంన్‌లో జ‌రిగిన భార‌త్ పాక్ క్రికెట్ మ్యాచ్ కు ద‌ర్జాగా హాజ‌ర‌య్యారు.దాయాదుల మ‌ధ్య న‌డిచే పోరును స్టేడియంలో కూర్చొని మ‌రీ ఆ ద‌ర్జా దొంగ లైవ్ గా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆయ‌న‌తో మాట్లాడేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ఆస‌క్తి చూపించిన‌ట్లుగా తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA2}

ఇటీవ‌ల అత‌డిని లండ‌న్ స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. క్ష‌ణాల్లో బెయిల్ తీసుకొని బ‌య‌ట‌ప‌డ్డారు. తాజాగా ఇండియా పాక్ మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చొని మ‌రీ మ్యాచ్‌ను తిల‌కించారు. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆయ‌న స్టేడియంలో లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ తో క‌లిసి మాట్లాడిన‌ట్లుగా కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తున్నాయి. చూశారుగా ఈ లిక్క‌ర్ దాదాను భార‌త్ తీసుకు రావ‌డానికి అధికార‌లు త‌ల‌లు గోక్కుంటుంటె…ద‌ర్జాగా క్రికెట్ మ్యాచ్‌ను చూసి ఎంజాయ్ చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -