Sunday, May 19, 2024
- Advertisement -

వివాహ విందులో డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొట్టిన విరుష్క జంట‌

- Advertisement -

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ తార అనుష్క శర్మ (డిసెంబర్ 11) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో పెళ్లి జ‌రిగింది. హ‌నీమూన్‌, పెళ్లి అనంత‌రం జ‌రిగే కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నారు. అనంత‌రం కోహ్లి, అనుష్క శర్మ త‌మ‌ వివాహ విందు గురువారం (డిసెంబ‌ర్ 21) న్యూఢిల్లీలో ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహ విందులో అనుష్క‌, విరాట్ కోహ్లీ చిందుల‌తో అద‌ర‌గొట్టారు. త‌మ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్‌ల‌తో సంద‌డి వాతావ‌ర‌ణం తీసుకువ‌చ్చారు.ప‌లువురు కేంద్ర‌మంత్రులు, రాజ‌కీయ నాయ‌కులు, భార‌త జ‌ట్టు క్రీడాకారులు, సినీ ప్ర‌ముఖులు, పారిశ్రామిక‌వేత్త‌లు హాజ‌ర‌య్యారు.

అయితే అనుష్క బాలీవుడ్‌లో హీరోయిన్ కావ‌డంతో ఈనెల 26వ తేదీన ముంబైలో బాలీవుడ్ ప్ర‌ముఖులతో పాటు క్రికెటర్లకు విందు ఇవ్వ‌నున్నారు. ఆ తర్వాత ఈ కొత్త జంట దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తారు. అక్క‌డే నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్ని కొన్నాళ్లు దాంప‌త్య జీవితాన్ని ఆస్వాదించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -