Sunday, April 28, 2024
- Advertisement -

అయోధ్యలో కోహ్లీ డూప్లికేట్..వైరల్

- Advertisement -

5 శతాబ్దాల భారతీయుల కల నెరవేరిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట చేయగా కోట్లాది మంది భారతీయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. ఇక ఇవాళ్టి నుండి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగగా నిన్న అయోధ్యకు పెద్ద ఎత్తున వీవీఐపీలు చేరుకున్న సంగతి తెలిసిందే.

సినీ,క్రీడా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో విశేషం ఏంటంటే టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ డూప్లికేట్ అయోధ్యంలో సందడి చేశాడు. సేమ్ విరాట్ కోహ్లీలానే ఉన్న వ్యక్తి టీమిండియా దుస్తుల్లో కనిపించేసరికి అతడితో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వాస్త‌వానికి అయోధ్యకు విరాట్ రావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వెళ్లేదు. దీంతో డూప్లికేట్ కోహ్లీ క‌నిపించ‌డంతో జ‌నం అతడి చుట్టూ ఎగడ్డారు. సెల్ఫీ ఫోటోలు, వీడియోల పోటీపడ్డారు. ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న తొలి రెండు టెస్టుల‌కు విరాట్ దూరం అయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -