టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రిపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఆసియాకప్కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే కోహ్లి రెస్ట్ ఇవ్వడంపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చాడు.
అసలు కోహ్లి ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందో అనే దానిపై వివరణ ఇచ్చిన రవిశాస్త్రి.. ‘ కోహ్లి చాలా అలసిపోయాడు. శారీరకంగా చూస్తే కోహ్లి పరిస్థితి ఒక ఎద్దులా మారిపోయింది. దాంతో కోహ్లి విశ్రాంతి అనివార్యమైందటూ శాస్త్రి చెప్పుకొచ్చాడు.అయితే ఇలా కెప్టెన్ని ఎద్దుతో పోల్చడంపై అభిమానులు శాస్త్రిపై ఫైర్ అవుతున్నారు.అయితే ఇక్కడ రవిశాస్త్రి చెప్పిన దానిని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.