ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో తన వ్యవహారశైలిపై విమర్శలు చేసిన వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. విలేకరుల సమావేశంలో నేనెవరో అందరికీ తెలిసేలా బ్యానర్ పట్టుకుని తిరగలేనని సమాధానమిచ్చాడు. నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవడంతో మూడో టెస్టుపై ఆసక్తి నెలకొంది.
నేను ఏం చేస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? అనే విషయాల్ని అందరికీ తెలిసేలా నేను బ్యానర్ పట్టుకుని తిరగలేను. అదేవిధంగా నన్ను ఇలా ఇష్టపడండి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే, అవి ఆ విమర్శలన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని నేను నియంత్రించలేను” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నా దృష్టి అంతా మెల్బోర్న్ టెస్టులో టీమ్ని గెలిపించడంపైనే ఉంది. ఇంకా చెప్పాలంటే.. నాపై వచ్చే వార్తలు, విమర్శలు గురించి నాకు పెద్దగా తెలీదంటూ బదులిచ్చాడు.