- Advertisement -
రాయల్చాలెంజర్స్ బెంగళూరు నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ను ఓడించిన సంగతి తెలిసిందే.మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతు ‘ఏబీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్.. అలాంటి ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. మేం ఇంకా కొన్ని తప్పిదాలను సరిదిద్దుకోవాలి. గత మ్యాచ్లో సాధించిన 90 పరుగుల కన్నా విజయంలో కీలకంగా మారిన నేటి 30 పరుగులే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు.
గత మ్యాచ్లో ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి విముఖత చూపాడు.కాని ఈ మ్యాచ్ అనంతరం సంతోషంగా ఆరేంజ్ క్యాప్ స్వీకరించాడు. ఏబీ డివిలియర్స్ 39 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 నాటౌట్గా నిలిచి ఒంటి చెత్తో విజయాన్నందించాడు.