అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన భార్య అనుష్క శర్మపై ప్రశంసలు కురిపించాడు. మహిళా సాధికారత, సమానత్వం, మహిళా అభ్యున్నతికి సంబంధించిన కార్యక్రమాల్లో విరాట్ చురుగ్గా పాల్గొనడంతో పాటు వారికి మద్దతుగా నిలుస్తున్నాడు. ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా తన జీవిత భాగస్వామికి ప్రత్యేక విషెస్ తెలిపాడు.
స్త్రీ, పురుషులు సమానం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోకు ‘మీ జీవితంలో విలువైన మహిళలను ట్యాగ్ చేయాల’ని అభిమానులను కోరాడు. తన భార్య అనుష్క శర్మను ట్యాగ్ చేశాడు.
ఈ సందర్భంగా వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు సమానం కాదన్నాడు. కానీ సమానంగా ఉంటే బాగుంటుందని అభిలషించాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదని చెప్పాడు. లైంగిక వేధింపులు, వివక్ష, సెక్సిజమ్, గృహ హింస, బెదిరింపులు లిస్టు చాలా పెద్దదైనా, వాటన్నింటినీ భరిస్తూ కూడా మహిళలు ఎదుగుతున్నారని హర్షం వ్యక్తం చేశాడు. సమానత్వం కంటే వాళ్లు ఎక్కువే అయినప్పటికీ, పురుషులతో మహిళలకు సమానత్వం లేదని పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Tag the extraordinary woman in your life who is #BetterThanEqual @Staywrogn@AnushkaSharma ♥️ pic.twitter.com/NdjNEPYQjD
— Virat Kohli (@imVkohli) March 8, 2018