నంద్యాల ఉప ఎన్నిక జోరు రోజురోజుకుఇ ఊపందుకుంటోంది.ఇప్పటికే ఇరు పార్టీ అభ్యర్తులు తమ ప్రచారాన్ని మొదలు పెట్టారు.అఖిల,శిల్పా ఇద్దరు సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు.
మొదట ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అఖిల ప్రకటించడంతో …శిల్పా కూడా సవాల్ను స్వీకరించారు.ఎవరో ఒకరు రాజకీయ సన్యాసం ఖాయం అనుకున్నారు రాజకీయ వర్గాలు. టీవీ ఛానల్లో కాకుండా బహిరంగంగా మరోసారి సవాల్కు కట్టుబడి ఉంటానని అఖిలప్రియ చెప్పాలని డిమాండ్ చేశారు శిల్పా.
{loadmodule mod_custom,GA2}
కాని సవాల్పై అఖిల కొత్త ట్విస్ట్ ఇచ్చారు.శిల్పా సవాల్కు తాను సిద్ధమని నేరుగా చెప్పకుండా గతాన్ని తీసుకొచ్చి ముందుపెట్టారు. రాజీనామా చేయడం తనకు పెద్ద సంగతేమీ కాదంటూనే … 2014 ఎన్నికల్లోనూ శిల్పామోహన్ రెడ్డి ఇలాంటి సవాలే చేశారని… కానీ ఎన్నికల తర్వాత ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదో చెప్పాలన్నారు. ముందు ఆ విషయం చెప్పి ఇప్పుడు సవాల్ గురించి చాలాతెలివిగా ఆట్లాడారు.ఇప్పటికిప్పుడే రాజీనామా చేసి స్పీకర్కు ఇచ్చేందుకు సిద్ధమని.. కానీ శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మొత్తం మీద రాజకీయ సన్యాసం సవాల్ విషయంలో నేరుగా స్పందించకుండా గతాన్ని గుర్తు చేయడం బట్టి అఖిలప్రియ… సవాల్ విషయంలో కాస్త మెత్తబడినట్టుగానే ఉంది.
{youtube}2yTeH45ljUY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related