తల్లిమరణంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనా అఖిలప్రియ..తండ్రి మరనంతో మంత్రి పదవిని అదిష్టించారు.చిన్నవయసులోనే రాజకీయ నాయకత్వాన్ని భుజాన వేసుకోవాల్సి వచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, మంత్రి పదవి దక్కించుకున్న అఖిలప్రియ.. ఈ మూడేళ్ళలో చాలా రాజకీయం నేర్చుకున్నారు.
{loadmodule mod_custom,GA1}
ఎక్కడ ఏంజరిగినా మీడియా,సోషియల్మీడియా పుణ్యమాని అది క్షనాల్లో ప్రజల ముందుకు వస్తోంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. మహా రాజకీయ పండితులే మీడియాముందు అనాలోచితంగా మాట్లాడి కంగుతిన్నారు.
మీడియాతో మాట్లాడేటప్పుడు కాస్తంత సంయమనం పాటించాలనీ, మాటకీ మాటకీ పొంతన తప్పనిసరనీ అఖిల ప్రియ ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. తన తండ్రి, స్వర్గీయ భూమా నాగిరెడ్డి మరణానికి కారణాల్ని ఆమే స్వయంగా వెల్లడించేసి నాలిక్కర్చుకోవడం గమనార్హం.మంత్రి పదవి కోసం ఎదురు చూసీ చూసీ.. చాలా ఆవేదన చెందారు..’ అంటూ భూమా నాగిరెడ్డి, మంత్రి పదవి కోసం ఎదురు చూసిన వైనంపై అఖిలప్రియ ఒప్పేసుకోవాల్సి వచ్చింది.
మంత్రిపదవికోసమే పార్టీ మారాడని విలేఖరులు ప్రశ్నించడంతో మాట మార్చిన అఖిల..తన తండ్రి దగ్గర ఏనాడు తన మంత్రి పదవిగురించి ప్రస్తావన తీసుకురాలేదని సెలవిచ్చారు.మంత్రి పదవికోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెల్లారనేది బహిరంగ రహస్యమే. చంద్రబాబు నాయుడు ఆడిన పొలిటికల్ గేమ్కి తెరలేపడం, ఈ క్రమంలోనే భూమా నాగిరెడ్డి తీవ్ర ఒత్తిడికి గురి కావడం తెల్సిన విషయాలే.
{loadmodule mod_custom,GA2}
మంత్రి పదవి విషయమై భూమాపై ఇంకెవరైనా కామెంట్ చేయొచ్చుగానీ, తన తండ్రి మరణానంతరం.. ఆయన ఇమేజ్ దెబ్బతినేలా అఖిలప్రియ వ్యవహరించడం ఎంతవరకు సబబు అనేది ప్రశ్నగా మారింది.అఖిలకు ఇంకా రాజకీయంలో అనుభవం రావాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- శిల్పా …అఖిల మద్య మాటల యుద్ధం….
- మా ఇలాకాలో మీపెత్తనమేంటి – భూమా అఖిలప్రియ
- నంద్యాలలో అఖిలప్రియకు చుక్కలు చూపించిన శిల్పా బ్యాచ్..!
- నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర పరిణామాలు
{youtube}ISUSSwJHkaY{/youtube}