నంద్యాల ఉప ఎన్నిక టికెట్టును ఎవరికి కేటాయించాలనే దానిపై ఆలోచించి చంద్రబాబకు తలబొప్పి కట్టినుంది.ఇద్దరిలో ఎవరికి కేటాయించినా పర్టీక తీవ్ర నష్టం తప్పెట్టులేదు.దీంతో బాబు పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలాగా తయారయ్యింది.ఎవరెళ్ళినా పార్టీకి నష్టమే నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టు కేటాయింపు వ్యవహరం టిడిపికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా తయారైంది.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడితే టిడిపికి నష్టమే.అయితే అదే సమయంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టున్న భూమా కుటుంబం కూడ పార్టీకి దూరమైతే పార్టికి నష్టమే.భూమా కుటుంబాన్ని కాదని శిల్పా మోహన్ రెడ్డికి టిక్కట్టు కేటాయిస్తే భూమా కుటుంబం ఏ మేరకు సహకరిస్తోందోననే చర్చ కూడ లేకపోలేదు.అయితే రెండు కుటుంబాల మద్య ఉన్న విబేధాలను కూడ మర్చిపోయి శిల్పా చక్రపాణి రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా భూమా నాగిరెడ్డి పనిచేసిన విషయాన్ని భూమా కుటుంబసభ్యులు గుర్తుచేస్తున్నారు.{loadmodule mod_custom,Side Ad 1}
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు అధికార టిడిపి, విపక్ష వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. టిడిపిలోని రెండు వర్గాలు టిక్కెట్టును ఆశిస్తున్నాయి.అయితే రెండు వర్గాల మద్య రాజీకుదిర్చేందుకుగాను టిడిపి నాయకత్వం ప్రయత్నాలను సాగిస్తోంది.అయితే టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ కూడ వ్యూహాలను రచిస్తోంది. టిడిపిని వీడి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది.అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారకుండా తాత్కాలికంగా పార్టీ నాయకత్వం నిలువరించగలిగింది.
అదే సమయంలో నంద్యాల టిక్కెట్టుపై గతంలో ఉన్న ఆశలు భూమా కుటుంబానికి కన్పించడం లేదు. శోభానాగిరెడ్డి వర్థంతి రోజున నంద్యాల నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని ప్రకటించకుండా టిడిపి నాయకత్వం నిలువరించగలిగింది.టిడిపిలోని అంతర్గత సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపి ప్రయత్నిస్తోంది.అయితే ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా టిడిపి చెక్ పెడుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}oao7TQkpYrY{/youtube}
Also Read