కడప జిల్లా జమ్ములమడుగు టీడీపీ సీనియర్నేత రామసుబ్బారెడ్డికి మరో సారి హ్యాండిచ్చారు చంద్రబాబు.ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పార్టీ అధినేత ఇచ్చిన మాట కలగానే మిగలనుంది.
జమ్మలముడుగు నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చిన తరువాత తీవ్ర కినుక వహించిన రామసుబ్బారెడ్డికి గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
{loadmodule mod_custom,GA1}
ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు వార్తలు వస్తుండడంతో రామసుబ్బారెడ్డికి నిరాశ తప్పదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉండగా ఒకటి పరకాలకు… మిగతా రెండు కూడా ఇతరులకు ఇస్తారని తెలుస్తోంది.ఆ లిస్టులో రామసుబ్బారెడ్డి పేరు లేదని టీడీపీ వర్గాల సమాచారం.
మరోవైపు పార్టీనే నమ్ముకుని ఉన్న తనకంటే ఫిరాయింపు నేత ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు ప్రయారిటీ ఇస్తుండడం… ఆదినారాయణరెడ్డిని ఏమాత్రం కంట్రోల్ చేయకపోవడంతో రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య కార్యక్రమం మహానాడుకు కూడా రామసుబ్బారెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ హాజరుకాలేదు.
అంతేకాకుండా రామసుబ్బారెడ్డి పార్టీ మారుతారని నిఘా వర్గాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చాయని కూడా అంటున్నారు. దీంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహించి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో అబ్యర్తుల పేర్లను కూడా వెలువడించే అవకాశం ఉంది.
{loadmodule mod_custom,GA2}
ఈవిషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి వర్గం కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు వార్తులు వస్తున్నాయి.. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని రామసుబ్బారెడ్డి బహిరంగంగానే అంటున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- కడప జిల్లా ఇద్దరి నేతలలో ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కుతుందో…
- పిరాయింపు ఎమ్మెల్యేలకు ఇక చుక్కలే..
- పార్టీలో ఈవివక్ష ఏంటి బాబు….
- చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..
{youtube}ISs6a-cQ7NA{/youtube}