నంద్యాల ఉప ఎన్నిక రాజకీయాల్లో హీట్ పెంచేస్తంది. పార్టీలనుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై రోజుకొక పేరు తెరమీదకు వస్తోంది.ఇప్పటికే టికెట్ అభ్యర్తి ఎవరనేదానిపై టీడీపీలో భూమా,శిల్పా వర్గాల మధ్య రసవత్తరపోటీ నెలకొంది. దీంతో సీటును ఎవరకి కేటాయించాలో బాబు తలపట్టుకుంటున్నారు. వచ్చే జూన్లో ఎన్నకలు జరగుతాయని ఈసీ తెలపడంతో టెన్సన్ బాబుకు పెరిగి పోయింది.
అయితే వైసీపీ మాత్రం జోరుగా ఉంది.ఇప్పటికే వైసీపీకీ రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని లగడపాటి సర్వే తో బాబుకు గుబులు పట్టుకుంది. సర్వేలు నమ్మె చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వేలో వైసీపీకి అనుకూలంగా పలితాలు రావడంతో రాష్ట్రంలో జరగాల్సిన కార్పొరేషణ్ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికపై జోరుమీదుంది వైసీపీ. వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన గంగుల ప్రతాప్రెడ్డి తమ్ముడు మాజీ ఎంపీ గంగుల ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన అన్నయ్యలాగానే వైసీపీలో చేరి నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.జగన్ తనను ఆహ్వానిస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నాన్నారు. ఒక వేల టికెట్ రాకపోయినా పార్టీనుంచి ఎవరు పోటీ చేసె అభ్యర్తి ఎవరయినా గెలుపు కోసం ముందుకు వెల్తానని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ ….గంగుల ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి.ఇదే జరిగితే ఉప ఎన్నికలో గెలపు వైసీపీకీ లాంచనమే అవుతుందన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తె జిల్లాలో టీడీపీ కనుమరుగు అవడం కాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై జగన్ ఏనిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Related