వైసీపీలోకి వలసలు ప్రారంభమవుతున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యలో …వివిధ రాజకీయ పార్టీలనుంచి నతలు క్యూకడుతున్నారు.మంత్రి వర్గ విస్తరనలో లోకేష్కు మంత్రి పదవి ఇవ్వడంపై ఒరేంజ్లో సీనియర్లో తిరుగుబాటును ఎగరేశారు.
తమలాంటి సీనియర్లు కాదని ఏరాజకీయ అనుభవంలేని లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టడంపై సీనియర్ నతలైన బొజ్జల,గోరంట్ల,ధూళిపాల్ల నరేంద్ర, మోదుగుల వంటి వారు బాబుపై విమర్శల వర్షం కురిపించారు.ఏదో విధంగా బాబు బ్రతిమలాడి బుజ్జగించారనుకోండి అదివేరేవిషయం.
బాబు ఎంత బుజ్జగించినా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.తాజాగా గుంటూరు వెస్ట్ నియేజక వర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరోసారి బాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.మేడే రోజున చంద్రన్న భీమా పథకం శుద్ధ వేస్ట్ని ..మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,నక్కా ఆనంద్బాబు సమక్షంలో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.తన నియేజక వర్గంలో భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు 1500 మంది దాకాఉన్నారని …వారితోపాటు హోటల్లలో బాలకార్మికులు ఉన్నారని వారిని పట్టించుకొనే నాధుడే కరువయ్యారని పార్టీని ఇరుకున పెట్టారు.
{loadmodule mod_custom,Side Ad 1}
వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్గా స్పందించింది.మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన వచ్చేఎన్నికల్లో టీడీపీలో ఉండే అవకాశాలు లేవని ..వైసీపీలో చేరేందుకే విమర్శలు గుప్పిస్తున్నారని గుంటూరు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ వైసీపీలోకి వచ్చే వకాశాలు ఉండటంతో ఆయన కంటె ముందుగానే వేణుగోపాల్ పార్టీలో చేరి వెస్ట్ నియేజకవర్గ టికెట్ హామీ జగన్నుంచి పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మోదుగుల వేణుగోపాల్రెడ్డి వైసీపీలో చేరితో ఇక టీడీపీ నుంచి వలసలు ప్రారంభమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Related