ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి ఇతరులను విమర్శించడం అలవాటుగా మారింది.రాష్ట్రంలో ఏంజరిగినా అది వైసీపీ అధినేత జగన్ పై నెట్టివేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.
గోదావరి పుస్కరాలకాడనుంచి …మొన్న జరిగిన కాపు ఉద్యమంలో రైలుని తగలబెట్టింది జగన్తోపాటు వైఎస్సార్సీపీకి చెందినవారేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సందర్భాల్లో ఆరోపించారు.
{loadmodule mod_custom,GA1}
ఇప్పుడు తాజగా రాజధాని అమరావతిలో వెలగపూడి పరిపాలనా భవన సముదాయంలో వర్షపు నీరు లీక్ అవడం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్లోకి ఆ నీరు ప్రవేశించడం తెల్సిన విషయాలే. ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి వుందని మల్లీ పాత పాటే పాడారు బాబు అండ్ కో.
సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్, ‘కుట్రకోణాన్ని’ తెరపైకి తీసుకురావడం గమనార్హం. మరోపక్క, సీసీటీవీ ఫుటేజ్లలో కొందరు వ్యక్తుల వర్షం కురిసిన సమయంలో ఆ భవనం పైకి వెళ్ళారంటూ మీడియాలో కథనాలు గుప్పుమంటున్నాయి. ఇలా ప్రతీదాన్ని జగన్పైకి నెట్టడంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకు పడ్డారు.రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు.
{loadmodule mod_custom,GA2}
రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఏడ్చినా… జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదని రోజా ఎద్దేవా చేశారు. భవనం లీకేజీపై తక్షణమే సీబీఐ విచారణకు సిద్ధపడతాలని ఆమె డిమాండ్ చేశారు.ఇదండి చంద్రబాబు మనువడు దేవాన్స్…జగన్కి ఉన్న సంబందం.
{loadmodule mod_sp_social,Follow Us}
Related