Tuesday, May 14, 2024
- Advertisement -

బాబుపై ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

- Advertisement -
YSRCP MLA RK Roja comments on Chandrababu Nava Nirmana deeksha

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడేళ్లుగా ప్రజలను నాశనం చేస్తూ ఇప్పుడు నవనిర్మాణదీక్షల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

మూడేళ్ల కాలంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. లోకేష్‌ను అడ్డదారిలో మంత్రిని చేయడం తప్ప ఏ ఒక్క యువకుడికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు.
ఈ రోజు ఆయన బాబు ప్రారంభించింది నవ నిర్మాణ దీక్ష కాదని… నారావారి నయవంచన దీక్ష అని మండిపడ్డారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.

{loadmodule mod_custom,GA1}

చంద్రబాబు ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి నున్నగా గుండు కొట్టించి 2019లో దిగిపోతారు. ఆ తర్వాత జగన్‌ వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కించి, అభివృద్ధి వైపు నడిపిస్తారు. అప్పుడు ఇదే చంద్రబాబు చూశారా… ఆ రోజు తాను నున్నగా గుండు గీయడం వల్లే ఈ రోజు ఒత్తుగా జుట్టువచ్చిందని ప్రచారం చేస్తారు” అని రోజా ఎద్దేవా చేశారు.
ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉందని… అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే, నవ నిర్మాణ దీక్షతో వారం పాటు మీ సంబరాలు ఏంటని ప్రశ్నించారు.రోజా అన‌డం స‌బ‌బుగానే ఉంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -