ఎప్పుడు రియాక్ట్ అవుతాడో తెలీదు హీరో శివాజీ. అప్పట్లో ప్రత్యేక హోదా విషయం లో నానా యాగీ చేసిన ఈయన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కేసాడు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పార్లమెంటు లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగ్ కి ఒచ్చేలా కనిపిస్తూ ఉండడం తో శివాజీ మళ్ళీ మీడియా లో కనిపిస్తున్నారు. ఈ బిల్లుకి తెలుగు దేశం తో పాటు అందరూ కలిసి మద్దతు ఇవ్వాలి అనే డిమాండ్ ఒస్తూ ఉండగా తెలుగు దేశం నేతలు ఈ బిల్లు మీద కాస్త రివర్స్ లో ఉండే చాన్స్ ఉంది.
ఈ అంశం మీద మాట్లాడ్డం కోసం బయటకి వచ్చారు శివాజీ. ప్రత్యేక హైకోర్టు విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు తెరాస ఎంపీలు సిద్ధమౌతున్నారనీ, అవసరమైతే సభలో స్పీకర్ పోడియాన్ని ముట్టడించే ప్లాన్ లో ఉన్నారనీ, ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం నాయకులకు ఇలా ఎందుకు ఆలోచించడం లేదని శివాజీ డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా కాకుండా ఏవో ప్యాకేజీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తే తాను ఊరుకోననీ, ముఖ్యమంత్రి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు. తాను చరిత్రలో నిలిచిపోయేందుకు సిద్ధంగా ఉన్నాననీ, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.