ఆంద్రప్రదేశ్ ఐటీ,పంచాయితీ రాజ్శాఖ మంత్రి లోకేష్ సోషియల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యారో దేశ వ్యాప్తంగా తెలియని వారుండరు. గూగుల్లో ముద్దపప్పు అని టైప్ చేస్తే లోకేష్ పోటో వస్తోంది.అయితే లోకేష్ చేస్తున్న తప్పిదాలు ప్రతిపక్షానికి అస్త్రంలాగా పనికొస్తున్నాయి. తాజాగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిని రెండురోజుల దీక్షలో చంద్రబాబు, లోకేష్ల వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అదిరిపోయే పంచ్లు విసిరారు.
బాహుబలి సినిమా ప్రపంచం వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి పీవర్ రాజకీయాలకు అంటుకుంది. జగన్ బాహుబలి అయితే ….లోకేష్ కామెడీ పీచన్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్ ….. సింహంలాంటి జగన్ ఎక్కడాని సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఇంతకాలం కామెడీ లేకుండా పోయిందని….. అందుకే నారాలోకేష్ అనె కామెడీ పీచ్ను బాబు అసెంబ్లీలోకి తీసుకొస్తున్నారని ఎద్దేవ చేశారు.
పనిలో పనిగా చంద్రబాబునుకూడా ఏకిపారేశారు. వచ్చే ఎన్నికల్లో వేలకోట్లు కుమ్మరించి ఓటర్లును ప్రలోభ పెట్టి అధికారంలోకి రావచ్చని బాబు కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా రాదన్నారు. వైసీపీ అధినేత జగన్.. నారాలోకేష్ మధ్య నక్కతోకు..నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అమెరికాకు వెల్లేది పెట్టుబడులకోసం కాదని…. ఇటీవల ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని… మతి మరుపుతో భాదపడుతున్నారని అందుకోసమే వైద్యం కోసం వెల్తున్నారన్నారు అనిల్ యాదవ్.
Related