Tuesday, May 21, 2024
- Advertisement -

ఇమ‌డ‌లేకే సొంత గూటికి..?

- Advertisement -
Jammalamadugu MLA Adinarayana Reddy back to YSRCP..?

ఆంద్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఏ ముహూర్తంలో పార్టీ ఫిరాయింపులు మొద‌లు పెట్టారో గాని అప్ప‌టి నుంచి బాబుకు కంటిమీద నిద్ర‌లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

పార్టీ కోసం ప‌నిచేసిన వాల్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా ఇత‌ర పార్టీల‌నుంచి వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కిండంతో అస‌మ్మ‌తి తారాస్థాయికి చేరుతోంది.వైసీపీనుంచి టీడీపీలోకి వ‌చ్చిన ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి రాకుండా రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా బాబు విన‌కుండా మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.దీంతో రామసుబ్బారెడ్డి మ‌హానాడుకు వెల్ల‌కుండా త‌న అస‌మ్మ‌తిని తెలియ‌జేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఇప్పుడు క‌డ‌ప జిల్లా టీడీపీ ఉపాధ్య‌క్షులు ఆదిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తామంతా పార్టీ కోసమే పని చేస్తున్నామని, అవకాశవాదులు పార్టీలోకి వచ్చినట్లే తిరిగి వెళ్లిపోవడం ఖాయమని లక్ష్మీదేవమ్మ మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.అలాంటి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రామసుబ్బా రెడ్డి కుటుంబం టిడిపి కోసం పని చేసిందని మరో నేత హరీంద్రనాథ్ అన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

2014 లో వైసీపీ త‌రుపున గెలిచిన ఆదినారాయ‌న రెడ్డి ఆ తర్వాత చోటు చేసుకున్న ప‌రినామాల‌తో టీడీపీలోకి జంప్ అయ్యారు.ప్ర‌ధానంగా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టేందుకే పార్టీలోకి చేర్చుకున్నార‌నేది అంద‌రికి తెలిసందే.అందుకే ఆదితోపాటు కీల‌క నేత‌ల‌పై టీడీపీ క‌న్నేసింది.ఆది అవ‌స‌రం కొద్ది టీడీపీలోకి వ‌చ్చార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.కాని అవ‌స‌రంకోసం వ‌చ్చిన ఆది 2019 ఎన్నిక‌ల్లో తిరిగి వైసీపీ గూటికి వెల్ల‌డంతో సందేహం లేద‌ని రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గీయులు భావిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}brDRm0ancNw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -