ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మంచి ప్లాన్స్ వేయడంలో గొప్ప వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల వ్యూహాలు.. ఎలాంటి సమయంలో ఏం చేయాలి.. ఎలా అధికారాన్ని దక్కించుకోవాలనే వాటి పై ఉంటాయి. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు దృష్టి పెట్టాడట టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
అవసరాన్ని బట్టి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భావించారట. కేంద్రం ఏపీ ప్రయోజనాలు నెరవేర్చని పక్షంలో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని బాబు వ్యూహారచన చేశారని కొందరు అంటుంటారు. పవన్ తో పొత్తు కారణంగా కాపు ఓట్లు కూడా మళ్లీ తమ ఖాతాలోకి వచ్చి చేరతాయని చంద్రబాబు అంచనా వేసినట్టు తెలుస్తోంది. అయితే యూపీ ఎన్నికల తరువాత చంద్రబాబు వ్యూహాం మారిందనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ దేశవ్యాప్తంగా బలపడటంతో.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సంగతిపై పవన్ ను కన్విన్స్ చేద్దామని భావిస్తున్న చంద్రబాబు.. ఈ విషయంలో ఆయన మొండిగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నుంచి ఆయనను పక్కనపెట్టాలని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ ని పక్కనపెట్టడం వల్ల జగన్, పవన్ మధ్య ఓట్లు చీలిపోతాయని.. అది కూడా తమకే లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నాడట. చంద్రబాబు ఇలాంటి వ్యూహాంతోనే ముందుకు వెళ్తే.. జనసేనకు కష్టకాలం తప్పకపోవచ్చు అంటున్నారు. మరో పక్క.. జగన్ కూడా సూపర్ ప్లాన్ వేస్తున్నాడట. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం పోయిందని.. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాడట.