తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయి ఇన్నాళ్ళు కావస్తూ ఉన్నా ఇంకా ఆమె మరణం వెనకాల ఉన్న మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఆమె మృతి సహజమైనది కాదు అనే అనుమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
మొదట ఆమె మరణం గురించి మాట్లాడని వారు కూడా ఇప్పుడు ఆమె నిజంగా హెల్త్ సమస్యల కారణంగానే చనిపోయిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణం లో వెతుకుతున్నారు. తమ పెద్దమ్మ జయలలితది సహజ మరణం కాదని… ఆమె మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని జయ సోదరి కుమార్తె అమృత డిమాండ్ చేశారు.
తమ పెద్దమ్మను కనీసం కలుసుకోవడానికి కూడా వీలులేకుండా శశికళ తమను దూరం పెట్టారని ఆమె ఆరోపించారు. తమ పెద్దమ్మ అంత్యక్రియలను ఈ రకంగా చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరంగపట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, ఆమె బంధువులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.