నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై వైసీపీ భారీ స్కెచ్ అమలు చేస్తోంది.ఈ ఎన్నికలో ఎలాగైనాగెలిచి అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.టీడీపీలో ఉన్న మైనస్ పాయంట్లను ఆయుధంగా చేసుకొని శిల్పాను గెలిపించుకొనేందుకు ఆపార్టీ ఎన్నిక వ్యూహకర్తను రంగంలోకి దింపింది.
జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. అందుకే జగన్ 2019 ఎన్నికల కోసం ఆయన్ను హైర్ చేసుకున్నారు. అందుకోసం ప్రశాంత్ టీం ఇప్పటికే జిల్లాల వారీగా ప్రజల పల్స్పై గ్రౌండ్ రిపోర్ట్ కూడా సిద్దం చేసిందట. ఎక్కడ వైసీపి బలం వుంది. ఎక్కడెక్కడ ఎలా బలం పెంచుకోవాలి.. గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అవసరమనే అంశాలపై నియోజవర్గాల వారీగా పకడ్బందీ ప్లాన్ ను సిద్దం చేశారట ప్రశాంత్ కిషోర్.
{loadmodule mod_custom,GA1}
2019 ఫలితాలు ఎలా ఉండబోతాయో..తన వ్యూహాలు ఎలా వర్కవుటవుతాయో..శాంపిల్గా నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీని గెలిపించి తీరుతారాలని ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు .నంద్యాల ఉప ఎన్నికలలో టిక్కెట్ ఎవ్వరికి ఇవ్వాలో జగన్ ముందే కొందరికి మాట ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఐతే ప్రశాంత్ కిషోర్ సూచనతో సదరు నాయకులే టిక్కెట్ బరి నుంచి స్వచ్చందంగా సైడయ్యారట.
ప్రశాంత్ కిషోర్ ..జగన్ వ్యూహరచనతో నంద్యాలలో శిల్పా మోహన్రెడ్డి గెలుపు ఖాయమంటే ఖాయమని………. ధీమాగా చెప్తున్నారు వైసీపీ క్యాడర్. ప్రశాంత్ కిషోర్ ..ముస్లింలు ఎంత మంది వున్నారు? రెడ్ల సంఖ్య ఎంత? బీసీ,ఎస్సీ ఇతర కులాల బలమెంత? ఇలా అన్ని లెక్కలు తీశారట. ముస్లిములు 50వేలు,రెడ్లు 30 వేలు, బీసీలు 45 వేలు,దళితులు 20వేలు, కాపులు బలిజలు 25వేలు అని గుర్తించారట. ఈ లెక్క ప్రకారం నంద్యాలలో వైసీపీ గెలుపుకు ఖతర్నాక్ ప్లానింగ్ ఇచ్చేశారట.ప్రశాంత్ కిషోర్ జగన్కు నంద్యాల గెలుపును బహుమతిగా ఇవ్వనున్నారని టాక్.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయం………
- జగన్తో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త భేటీ… 2019లో వైసీపీ విజయం ఖాయం..
- ప్రశాంత్ కిషోర్తో డీల్… 2019 ఎన్నికలకు జగన్ పక్కావ్యూహం..
- గతంలో చేసిన తప్పిదాలు చేస్తే మరోసారి అధికారం దూరమయ్యే అవకాశం..
{youtube}AWBHm4mEYg4{/youtube}