హైదరాబాద్: చంద్రబాబుకు, బాహుబలి సినిమాలో విలన్ కాలకేయుడికి సంబంధమేంటి? అవును సంబధముందంటున్నారు టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భూములలో మూడు పంటలు పండించేందుకు ప్రయత్నిస్తుంటే, ఏపీలో చంద్రబాబు మూడు పంటలు పంటే భూములను రైతుల నుంచి లాక్కొన్నారని ఆయన విమర్శించారు.
ముప్పై వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అందుకే ఆయన్ను కాలకేయుడు అంటున్నామని అన్నారు ప్రభాకర్.
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తోంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉనికి కోసం రైతు యాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో 15వేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని, అందులో తెలంగాణ రైతుల మరణానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న టీడీపీ ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తోందని ఎమ్మెల్సీ ప్రభాకర్.