ఏపీలో వలసల జోరు అసలు అగడం లేదు.. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి కి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలానే వచ్చే ఎన్నికల్లోపు వైసీపీ వైపు 20 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు జగన్ కు షాక్ తగిలింది. వైసీపీకి చెందిన సీనియర్ నేత జగన్ కు షాకిచ్చి టీడీపీలో చేరబోతున్నారు.
కర్నూలు జిల్లాకు చేందిన వైసీపీ నేత దర్మవరం సుబ్బారెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ డిఫ్యూటీ సీయం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో దర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలో చేరారు. సుబ్బారెడ్డితో పాటు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్య కర్తలు కూడా టీడీపీలో చేరారు. కేఈ కృష్ణమూర్తి కండువా కప్పి దర్మవరం సుబ్బారెడ్డిని పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తులో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. గతంలో సుబ్బారెడ్డిని వైకాపా నుంచి సస్పెండ్ చేసారు.
{loadmodule mod_custom,Side Ad 1}
కొంత కాలం సైలెంట్ గా ఉన్న సుబ్బా రెడ్డి ప్రస్తుతం టీడీపీ లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్మవరం సుబ్బారెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ విషయంపై వైసీపీ నేతలు ఆయన వెళ్లడం వల్ల పార్టీకి ఏం నష్టం లేదని.. వచ్చే ఎన్నికలో వైసీపీ.. అధికారం దక్కించుకోవడమే కాకుండా జగన్ సీఎం అవుతారని అంటూన్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related