- Advertisement -
కేరళలోని కొంగాడ్ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు కేవీ విజయదాస్(61) కొవిడ్తో మృతిచెందారు. పలకాడ్ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా, చిత్తూరు ప్రాంత పార్టీ సెక్రటరీగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తుండేవారు. విజయ్దాస్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. దాస్ నిరంతరం జనంతోనే ఉండేవారని, ఆయన జనం మెచ్చిన నేత అని అన్నారు.
విజయదాస్ మృతి తనన ఎంతో కలిచి వేసిందని ప్రతిపక్షనేత చెన్నితాల రమేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాస్ నిరంతరం శ్రమించేవారని గుర్తుచేశారు.విజయ్ దాస్ 1959లో జన్మించారు. 2016లో ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.