మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ మీడియాతో మాట్లాడకూడదన్న ఎస్ఈసీ ఆదేశాలను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయగా….మాట్లాడేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఈసీ, కమిషనర్ లక్ష్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి పెద్దిరెడ్డిని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం సంతోషకరమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ అన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా, ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలపర్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సిబ్బంది పనితీరును ప్రశంసించారు. రెండో విడత ఎన్నికలకూ ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.
Also Read