Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ కళ్యాన్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

ఏపిలో గత కొంత కాలంగా రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి ఒక సిద్దాంత పరంగా ఉంటుందని.. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని అన్నారు.

వరుసగా విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు.. కానీ రాజకీయాల్లో అలా కుదరదని తెలిపారు. మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్ తర్వాత టీడీపీతో జత కట్టారు. ఇక దాని పనైపోయిందని ఇప్పుడు బీజేపీ వెంట పడుతున్నారు. అయితే బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.

గత కొంత కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు పవన్, చంద్రబాబు కి ఎలా బుద్ది చెబుతున్నారో ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.. ఆయనపై గ్రంది శ్రీనివాస్ గెలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -