మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు ఇండస్ట్రీలో కథా రచయితగా, దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే అల్లు అర్జున్తో తెరకెక్కించిన “అల వైకుంఠపురములో” సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నట్లు ఇటీవలే వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు త్రివిక్రమ్.
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మూవీపై పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై “ఎస్ఎస్ఎమ్బీ28” అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్నారు.సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
Also read:ఈ ఫొటోలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..?
మహేష్ బాబు మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రయోగాత్మక మూవీని తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.కథను బట్టి చిన్న హీరోలతో సినిమా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండే త్రివిక్రమ్ మహేశ్ మూవీ తర్వాత చిన్న సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్, నటీనటుల ఎంపిక వంటి అంశాలపై ఫోకస్ పెట్టి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.