మెగా హీరో సాయి ధరమ్ కి మెగా హీరోల ప్రోత్సాహం ఉంది. చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మేనల్లుడు తేజు స్టార్ హీరోగా ఎదగాలని ఆశిస్తున్నారు. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సాయి ధరమ్ తేజ్.. తిక్క, విన్నర్ సినిమాలతో ప్లాప్లు చూసాడు.
దాంతో అతన్ని హిట్ ట్రాక్ లోకి తీసుకురావాలని చిన్న మామయ్య పవన్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ కాటమరాయుడు నిర్మాత, స్నేహితుడు అయిన శరత్ మరార్ కి పవర్ స్టార్ చెప్పినట్లు సమాచారం. మీడియం రేంజ్ బడ్జెట్ తో తేజు సినిమా ప్లాన్ చేస్తానని నిర్మాత కూడా అంగీకారం తెలిపినట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాటమరాయుడు రిలీజ్ పనుల్లో బిజీగా ఉండడం ఆ ఈ ప్రాజక్ట్ ని పక్కన పెట్టారని, మార్చి 28 తరవాత తేజు సినిమాపై శరత్ మరార్ దృష్టి పెట్టనున్నట్లు తెలిపాయి. ఈ మూవీకి పవన్ కి ఇష్టమైన దర్శకుల్లో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
Related