ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటుంది. భూమి, ఆకాశం, సముద్రాన్ని మనిషి జయించాడు.. కానీ మూఢ నమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. ఇప్పటికే పలు దేశాల్లో మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మూఢనమ్మకానికి ఓ యువకుడు బలి అయ్యాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు నరేష్(24) ఉన్నారు.
డిగ్రీ వరకు చదివిన నరేష్ గత కొంత కాలంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 1న మూర్ఛతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు స్థానిక భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. నరేష్ కి దెయ్యం పట్టిందని తాను ఆ దయ్యాన్ని వదిలించేస్తాని చెప్పాడు. కర్రతో ఆ భూత వైద్యుడు కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు.. దెబ్బలు తాలలేక సొమ్మసిల్లిపోయాడు నరేష్.
ఇక విషయం తెలుసుకున్న గ్రామస్థులు తల్లిదండ్రులను మందలించి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన నరేశ్ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. భూత వైద్యున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
మెగా వ్యాక్సినేషన్.. ఒకే రోజు 40 వేల మందికి టీకా పంపిణీ