- Advertisement -
నందమూరి బాలకృష్ణ హీరోగా…బోయపాటి శ్రీను దర్శకత్వంలో గత ఏడాది విడుదలై అఖండ విజయం అందుకున్న మూవీ అఖండ. టికెట్ ధరలు పెంచకుండానే ఈ సినిమాలో బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపింది. ఏకంగా 125 కోట్లు దక్కించుకుంది. బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అఖండ చివర్లో సీక్వెల్ ఉంటుందని బోయపాటి హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. రచయితలతో కథ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే అఖండ తర్వాత బాలయ్యతో బోయపాటి ఓ పొలిటికల్ మూవీ తీయడానికి ప్లాన్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో దాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం అఖండ 2ను తెరకెక్కించడంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా అఖండ2ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.