వకీల్ సాబ్, భీమ్లానాయక్ తో వరుస హిట్స్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు ఓకే చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ తో తొలిసారి పూజా హెగ్డే జోడీ కట్టనుంది. దేవీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు.
కమర్షల్ ఎంటర్ టైనర్ గానే కాకుండా సందేశాత్మకం ఈ సినిమా ఉండబోతున్నట్లు టాక్. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఆగస్టులో సెట్స్ పైకి రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇలాంటి పాత్రలో పవన్ మునుపెన్నడూ లేదంటున్నాడు దర్శకుడు హరీష్. పవర్ స్టార్ కాస్ట్యూమ్స్, డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయంటున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.