రాబోయే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైఎస్సార్ సీపీ 175కి 175 సీట్లు గెలిచే అవకాశం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో టెలి కాంఫరెన్స్ లో మాట్లాడిన సజ్జల రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలిచే వాతావరణం ఉందని అన్నారు. ఈ కాంఫరెన్స్ లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల మాట్లాడారు. ఓటర్ల జాబితా విషయంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
దొంగ ఓట్ల తొలగింపు, అర్జులైన వారినే ఓటర్లుగా ఉంచాలని ఆయన అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. 9 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్న ఈ టైం లో పార్టీకి ప్రతిరోజు చాలా కీలకమని ఆయన అన్నారు.
పార్టీ పరిశీలకులు ఎమ్మెల్యేలకు కో ఆర్డినేటర్లకు సంధానకర్తగా అందరు పనిచేయాలని. వాలంటీర్లను డీ ఫేం చేయాలని ప్రతి పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.. వాలంటీర్ల పై ప్రతిపక్షాలు చేస్తున్న విధ్వేష, విషపొర్త ప్రచారాలను తిప్పి కొట్టాలని అన్నారు సజ్జల. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆయన అన్నారు. అందుకు పార్టీ కార్యకర్తలంగా కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారం తెచ్చుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి నెక్స్ట్ సిఎం గా ఎవరిని ఎంచుకుంటారు ప్రజలు అధికారం పక్షం వైపు ఉన్నారా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారా అన్నది ఎలక్షన్స్ లో తెలుస్తుంది.