తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కాగా మరోకటి కామారెడ్డి. సీఎం కామారెడ్డి నుండి పోటీ చేస్తారని కన్ఫామ్ కాగానే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.
ఇక అప్పటివరకు కామారెడ్డి స్ధానం నుండి పోటీకి అన్ని సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ పోటీ అని ప్రకటించిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగారు షబ్బిర్. కానీ తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
2004లో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్ అలీ ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2010లో ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డి కంటే ఎల్లారెడ్డే సేఫ్ ప్లేస్ అని భావిస్తున్నారట షబ్బీర్. కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉన్న ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.
అయితే ఎల్లారెడ్డిలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మోహన్ రావు, బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షబ్బీర్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది..ఎల్లారెడ్డి టికెట్ దక్కుతుందా వేచిచూడాలి..