మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగగా తాజాగా మరో సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఎలాంటి టైం చెప్పకుండా…మావా ఎంతైనా.. అంటూ ఎమోషనల్ తో సాగే మాస్ సాంగ్ని రిలీజ్ చేశారు. సడెన్ గా తమ అభిమాన హీరో మూవీ నుండి సాంగ్ రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడం ఒక వంతైతే ఆనందాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. మావా ఎంతైనా అనే సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మాస్ స్టెప్పులతో అదరగొట్టగా ఈ పాటలో మీనాక్షి మెప్పించింది.
మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కుర్చీ మడతబెట్టి,దమ్ మసాలా, ఓహ్ మై బేబీ సాంగ్స్ యూ ట్యూబ్లో ట్రెండింగ్గా మారగా ట్రైలర్లో తన మార్క్ చూపించారు త్రివిక్రమ్.