Sunday, May 19, 2024
- Advertisement -

పవన్‌.. అనకాపల్లి – పీఠాపురం ఫిక్స్!

- Advertisement -

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకున్న సంగతి తెలిసిందే. తొలుత రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా తాజాగా ఫస్ట్ లిస్ట్ తర్వాత పవన్ వ్యూహం మార్చుకున్నారు. రెండు అసెంబ్లీకి కాకుండా ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే పవన్ భీమవరం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన అవన్ని రూమర్లేనని తేలిపోయింది. ఇక తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక స్థానం నుండి అసెంబ్లీకి, ఉత్తరాంధ్ర నుండి ఎంపీగా పోటీచేయటానికి గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారట పవన్.

ఇక అసెంబ్లీకి పోటీ చేసే స్థానం విషయానికొస్తే పిఠాపురం పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో సర్వేలు కూడా నిర్వహించారట పవన్. అలాగే పార్లమెంట్ స్థానం విషయానికొస్తే అనకాపల్లి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే అనకాపల్లి నుండి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగిన పవన్‌ కోసమే మెగా బ్రదర్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో భీమవరం,గాజువాక ఓడిపోగా ఈ సారి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పవన్ తీసుకున్న నిర్ణయం ఏమేరకు ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -