- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు బోర్డు అధికారులు. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ శరవేగంగా జరుగుతుండగా వారం రోజుల్లోనే ఫలితాలను అనౌన్స్చేయనున్నారు.
ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో వాల్యేయేషన్ పూర్తికానుండగా ఈనెల 17వ తేదీ తరువాత ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 20వ తేదీలోపు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనున్నారు. విద్యార్థులు ఫలితాలను వాట్సాప్ నెం. 9552300009 ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ https://bieap.apcfss.in/ లేదా https://bie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
