- Advertisement -
వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమ శిక్షణ ఉల్లంగించిన కీలక నేతలను సస్పెండ్ చేసింది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమ శిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంది హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకే వస్తుందని ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ప్రకటించారు నవీన్ నిశ్చల్.

