- Advertisement -

నీట మునిగిన వరంగల్

- Advertisement -

తుఫాన్ మొంథా తీరం దాటగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభవం చూపింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, యాదాద్రి–భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించింది మొంథా తుఫాన్.

వరంగల్, హన్మకొండ ప్రాంతాలు 300 మిల్లీమీటర్ల నుంచి 420 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదుకాగా ఇది చరిత్రలోనే అత్యధికం. అకస్మాత్తుగా కురిసిన మోస్తరు–భారీ వర్షాలు హన్మకొండలో భయాందోళన సృష్టించాయి. గోపాలపురం వాగు చెరువు ఉప్పొంగడంతో, నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి.
దీంతో రవాణా పూర్తిగా దెబ్బతింది, వాహనాలు నిలిచిపోయాయి.

దురదృష్టవశాత్తు, హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థిని ఒకరు జంగావ్ ప్రాంతంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయారు. అక్టోబర్ 30 ఉదయం 5 గంటలకు, భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల ప్రభావం కొనసాగవచ్చని హెచ్చరించింది.

వరంగల్‌పై తీసిన డ్రోన్ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, తుఫాన్ మోంథా విధ్వంసం ఎంత తీవ్రమైందో అది స్పష్టంగా చూపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -