- Advertisement -

శబరిమల రద్దీపై కేరళ హైకోర్టు..కీ సూచన

- Advertisement -

మంగళవారం శబరిమల ఆలయ ప్రాంతంలో అసాధారణ స్థాయిలో భక్తులు పోటెత్తడం, దాని కారణంగా ఏర్పడిన గందరగోళంపై కేరళ హైకోర్టు బుధవారం అధికారులను తీవ్రంగా విమర్శించింది.అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని కోర్టు అభిప్రాయపడింది.అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ను కూడా తప్పుబట్టింది.

గతంలో ఇచ్చిన సూచనలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. అవసరమైన పనులలో చాలావరకు ఆరు నెలల క్రితమే పూర్తి చేయాల్సిందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా గమనించారు.ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో భక్తులను ఆలయ ప్రాంతంలోకి ఎందుకు అనుమతించారని కోర్టు ప్రశ్నించింది. అందరినీ ఒకేసారి ముందుకు పంపడం సురక్షితం కాదని, దానికి బదులుగా భక్తులను వేరు వేరు సెక్టార్‌లుగా విభజించడం ద్వారా రద్దీని మెరుగ్గా నిర్వహించవచ్చని న్యాయస్థానం సూచించింది.

కోర్టు లేవనెత్తిన ఆందోళనలను పంచుకుంటూ, కొత్తగా నియమితులైన చైర్మన్ కె. జయకుమార్ కూడా ఆరు నెలల క్రితమే ఏర్పాట్లు చేయాల్సిందని అంగీకరించారు.నవంబర్ 17న ఆలయం తెరిచిన 48 గంటల్లోనే దాదాపు రెండు లక్షల మంది భక్తులు శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. దీంతో మంగళవారం ఆలయ అధికారులు మరియు పోలీసులు భారీ రద్దీని నియంత్రించడంలో ఇబ్బందులు పడ్డారు. పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు 18 మెట్ల దగ్గర, పంబా నుండి సన్నిధానం వరకు దారి పొడవునా కిక్కిరిసిపోయి కనిపించారు. గంటల తరబడి క్యూలలో నిలబడిన భక్తులకు తాగునీరు కూడా అందడం లేదని ఫిర్యాదులు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -