Friday, April 19, 2024
- Advertisement -

39 రోజులు అవుతున్నా కేవలం రూ. 9.09 కోట్ల ఆదాయమే..!

- Advertisement -

కొవిడ్ నిబంధనల కారణంగా ఈ ఏడాది కేరళలోని శబరిమల ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. ఆలయ దర్శనం ప్రారంభమై 39 రోజులు అవుతున్నా కేవలం రూ. 9.09 కోట్ల ఆదాయమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఆలయ ఆదాయం రూ. 156 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు 71,706 మంది ఆలయ దర్శనానికి వచ్చారని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్​ వాసు మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆలయ ప్రాంగణంలో కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్​ వాసు. ఆలయ దర్శనం ప్రారంభమయ్యాక… 289 మంది కార్యనిర్వాహక సిబ్బందికి పాజిటివ్​గా తేలిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దర్శనార్థం వచ్చిన భక్తుల్లో 390 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -