భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ డీల్లలో ఒకటిగా నిలిచే విధంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను ఒక కన్సార్టియం USD 1.78 బిలియన్ (సుమారు ₹16,660 కోట్లు)కు కొనుగోలు చేసింది. ఈ డీల్లో భాగంగా ఆర్యమన్ బిర్లాను కొత్త చైర్మన్గా ప్రకటించారు.
ప్రస్తుతం RCB యజమాని అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఈ ఒప్పందాన్ని ధృవీకరించింది. కొనుగోలు చేసిన గ్రూపులో ఆదిత్య బిర్లా గ్రూప్, బ్లాక్స్టోన్ సంస్థకు చెందిన BXPE, డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఉన్నాయి.
ఈ డీల్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా ఫ్రాంచైజీ బాధ్యతలు ఈ కన్సార్టియం తీసుకోనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా. ప్రొఫెషనల్ క్రికెట్లో కెరీర్ ప్రారంభించి, తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
17 ఏళ్ల వయసులోనే ముంబైని విడిచి మధ్యప్రదేశ్లో క్రికెట్ అవకాశాల కోసం వెళ్లిన ఆర్యమన్, ఇంగ్లాండ్లో కూడా వెస్ట్ హాంప్స్టెడ్ క్రికెట్ క్లబ్, లండన్ స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అనుభవం సంపాదించారు. 2016లో CK నాయుడు ట్రోఫీలో 602 పరుగులు చేసి మంచి గుర్తింపు పొందారు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో ఒక సెంచరీ చేశారు.
2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికైనా రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. తర్వాత క్రికెట్ను వదిలిన తర్వాత ఆర్యమన్ బిర్లా వ్యాపార రంగంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో సభ్యుడిగా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు.
