- Advertisement -

విస్తరించిన నైరుతి..భారీ వర్షాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాం: విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లuri సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు.

వర్షాలు పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున పొలాల్లో పనిచేసే వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. రుతుపవనాల రాకతో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోయిన కోస్తా, రాయలసీమ ప్రజలకు ఎండల తీవ్రత నుండి ఉపశమనం లభించనుంది. అలాగే ఈ వర్షాలు ఖరీఫ్ సాగు పనులకు ఎంతగానో మేలు చేయనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -