ఆంధ్రప్రదేశ్లో వాతావరణం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలుల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
APSDMA విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ హెచ్చరికలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
తక్కువ ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులు సూచించారు. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు కూడా తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులు సూచించారు. మొత్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

