- Advertisement -

రజనీకాంత్ అభిమానులకు గుడ్‌న్యూస్‌!

- Advertisement -

మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల అద్భుతమైన మేళవింపుతో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జైలర్‌’. అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష స్పందనతో ఈ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు ఎప్పుడో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘జైలర్‌ 2’ విడుదల తేదీని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్‌ 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దాంతో అక్కినేని, రజనీకాంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మొదటి భాగంలో పలు భాషలకు చెందిన అగ్రతారలు కీలక అతిథి పాత్రల్లో మెరిశారు. అదే తరహాలో రెండో భాగంలోనూ భారీ తారాగణం సందడి చేయనుంది. ప్రముఖ సీనియర్ నటుడు మిథున్‌ చక్రవర్తి ఈ సీక్వెల్‌లో ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ఏ సస్పెన్స్ వద్ద ఆగిపోయిందో, సరిగ్గా అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ ప్రారంభమవుతుందని నటుడు శివరాజ్ కుమార్‌ గతంలోనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మొదటి సినిమా ఇచ్చిన హై కంటెంట్ కంటే సీక్వెల్‌లో యాక్షన్, ఎమోషన్స్ మరింత పీక్స్‌లో ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -