‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్కు దేశవ్యాప్తంగా భారీ క్రేజీ వచ్చేసింది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్గా తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా వస్తోంది. ప్రభాస్ పక్కన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి హాట్ టాపికవుతోంది. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆ పాత్ర విలన్ షేడ్స్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పోలీసు ముసుగులో ఉన్న దొంగా? లేక నిజాయతీ గల అధికారా? అనే విషయం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మిగతా షూటింగ్ కోసం ఈ సినిమా బృందం త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది.