పవన్ ఫ్యాన్స్తో గొడవ తరువాత పెద్దగా కనిపించని మూవీ క్రిటిక్ కత్తి మహేష్, శ్రీరెడ్డి వ్యవహరంతో మళ్లీ తెరపైకి వచ్చాడు. చాలా వేదికలలో శ్రీరెడ్డితో కలిసి పలు టీవి షోలలో పోల్గొన్న కత్తి శ్రీరెడ్డికి మద్దతుగా మాట్లాడాడు.సినీ ప్రముఖు బాగోతాలను ఆమె బజారుకీడుస్తోంది. శ్రీరెడ్డి వ్యవహరం కారణంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ CASH పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.దీనిపై కత్తి తెలుగు అగ్ర హీరోలపై ఆశక్తికరమైనా ట్వీట్ చేశాడు.శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల గురించి తెలుగు అగ్రహీరోలెవరూ నోరు మెదపడం లేదు.
దీంతో వీరిని లక్ష్యంగా చేసుకొని కత్తి మహేష్ ట్వీట్లతో చెలరేగిపోయాడు. ఆ ట్వీట్ సారాంశం ఏటంటే “బావా! ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత రచ్చ జరుగుతుంటే, ఈ మెగాలు, గిగాలు, సూపర్లు, పవర్లు ఒక్క మాట బాధిత మహిళల గురించి అనడం లేదు. ఎందుకు?” వాళ్ల పేర్లు బయటకు రాలేదని సంతోషిస్తున్నారో! మనకెందుకులే అని అన్ని విషయాల్లాగా ఉరుకుంటున్నారో నాకూ తెలియదు బామ్మర్ది!’’ అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశాడు.
"బావా! ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత రచ్చ జరుగుతుంటే, ఈ మెగాలు, గిగాలు,సూపర్ లు,పవర్ లు ఒక్క మాట బాధిత మహిళల గురించి అనడం లేదు. ఎందుకు?"
వాళ్ళ పేర్లు బయటకు రాలేదని సంతోషిస్తున్నారో! మనకెందుకులే అని అన్ని విషయాల్లాగా ఉరుకుంటున్నారో నాకూ తెలియదు బామ్మర్ది!
— Kathi Mahesh™️ (@kathimahesh) April 12, 2018